Thursday, March 28, 2024

రాఘవుడి సేవలో మంత్రి జయరామ్

మంత్రాలయం (ప్రభ న్యూస్) : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్ధం ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ గురువారం మంత్రాలయానికి వచ్చారు. మంత్రికి మఠం అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని విశేష పూజలు చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు మెమొంటో, శేష వస్త్రం, ఫలా పుష్ప మంత్రాక్షికలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాస రావు, ఐపి నరసింహమూర్తి,వ్యాస్ రాజ్ ఆచార్, బిందు స్వామి, సిఐ శ్రీనివాసులు ఎస్సై వేణుగోపాల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement