Friday, May 17, 2024

బీఆర్ఎస్‌కు తిరుగులేదు.. మళ్లీ గెలిచేది మనమే: పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు రూరల్, (ప్రభన్యూస్): బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని, మళ్లీ గెలిచేది మనమే అని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలం మల్కాపూర్ లో భారీగా చేరికలు జరిగాయి. తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్సీ గౌడ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడే షేక్ హసన్ పటేల్, కోఆప్షన్ సభ్యులు ఎండి శంషోద్దీన్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement