Sunday, April 28, 2024

TS: బీఆర్ఎస్ మేడిగ‌డ్డ ప‌ర్య‌ట‌న‌లో అప‌శృతి… పేలిన బ‌స్సు టైర్..

స్టేష‌న్ ఘ‌న‌పూర్ – బీఆర్ఎస్ తలపెట్టిన ‘ఛలో మేడిగడ్డ’ టూర్‌లో అపశృతి చోటు చేసుకుంది.. మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో ఛలో మేడిగడ్డకు వెళ్తున్న బస్ టైర్ మార్గమధ్యలో బ్లాస్ట్ అయింది. ఈ ఘటన స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో చోటుచేసుకుంది. దీంతో దారిలోనే బీఆర్ఎస్ నేతలు వెళుతున్న బస్సు ఆగిపోయింది. ఈ ఘటనతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు.

బస్సులో కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. సమాచారం అందుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు స్థానికంగా ఉన్న మెకానిక్‌ను పిలిపించిన నేతలు సమీపంలోని టైరును మార్పించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement