Thursday, May 16, 2024

బోరుమ‌న్న‌ రాజ‌య్య‌….ఇప్పటికీ, ఎప్ప‌టికీ కెసిఆర్ కు విధేయుడినేనన్న మాజీ డిప్యూటీ సిఎం

స్టేష‌న్ ఘ‌న్ పూర్ – స్టేషన్ ఘన్‌పూర్ టిక్కెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటతడి పెట్టారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారితో మాట్లాడుతూ ఒక్కసారిగా బోరున విలపించారు. ఆతర్వాత కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని వెక్కివెక్కి ఏడ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు ఈసారి టిక్కెట్ దక్కలేదు. ఈ నియోజకవర్గం నుండి రాజయ్య 2014, 2018లో బీఆర్ఎస్ నుండి గెలిచారు. అయితే ఈసారి ఈ టిక్కెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి దక్కింది. తనకు టిక్కెట్ దక్కకపోవడంతో రాజయ్య కన్నీటిపర్యంతమయ్యారు.


అనంత‌రం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ఉన్నతస్థానం కల్పిస్తామని కేసీఆర్ తనకు చెప్పారన్నారు. ఇప్పుడు ఉన్న స్థానం కంటే మంచిస్థానం తనకు కల్పిస్తానని హామీ ఇచ్చారని, అధినేత మాటను గౌరవించి తాను ముందుకు సాగుతానన్నారు. కేసీఆర్ గీసిన గీతను తాను దాటేది లేదని, ఆయన ఆదేశాలు పాటిస్తానని స్పష్టం చేశారు. కేసిఆర్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్ధికి సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తాన‌ని, బిఆర్ఎస్ విజ‌యానికి కృషి చేస్తాన‌ని రాజ‌య్య అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement