Saturday, July 27, 2024

ఇల్లందులో బి అర్ ఎస్ కాంగ్రెస్ ఘర్షణ…

ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని బర్లపెంట పోలింగ్ బూతులో అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఈరోజు ఘర్షణ జరిగింది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటు వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లకు గుర్తు చెప్పే విషయంలో పరస్పర విమర్శలు చేసుకొని ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి ఇరువర్గాలను చెదరగొట్టారు

ఓటింగ్ ప్రారంభ దశలోనే బారులు తీరిన ఓటర్లు

నియోజకవర్గంలో పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభం కాగా 7:30కే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులకు వెళ్లే కార్మికులు ఉదయమే ఓటు వేసి వెళ్లాలన్న ఆలోచనతో అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. ఓటు వినియోగించుకోవడానికి వచ్చే ప్రజల్లో అత్యంత ఉత్సాహం కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement