Saturday, May 4, 2024

Breaking: పెన్షన్​ బెనిఫిట్స్​ కోసం లంచం.. ఏసీబీ వలలో సీనియర్​ అకౌంటెంట్​

హైదరాబాద్​లోని పెన్షన్​ ఆఫీసులో లంచగొండిని వల వేసి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ మహిళ నుంచి 10వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా సీనియర్​ అకౌంటెంట్​ ప్రసాద్​ని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అయితే.. ప్రభుత్వ టీచర్లు అయిన తన తల్లిదండ్రుల మరణం తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోసం ఏడాది క్రితం అప్లికేషన్​ పెట్టుకుంది ఓ 42 ఏళ్ల మహిళ. కాగా ఆ డబ్బులు కావాలంటే ప్రాసెస్​ చేయాల్సి ఉంటుందని.. ఈక్రమంలో తనకు 27వేల రూపాయలు ఇస్తేనే పని పూర్తి చేస్తానని ప్రసాద్​ చెప్పాడు. దీంతో తొలి విడతగా 10 వేల రూపాయలు ఇచ్చింది ఆ మహిళ.. అయితే.. ఈరోజు మరో పది వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement