Friday, May 17, 2024

Breaking : భార్యను కొట్టి చంపిన భర్త

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ గ్రామంలో భార్యను హత్య చేశాడు భర్త .స్థానికుల కథనం ప్రకారం మండలంలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన జన్ను నరేష్ ఆర్.ఎం.పి.వైద్యునిగా పని చేస్తున్నాడు.అతని భార్య అరుణ(వయస్సు 38సంవత్సరాలు) ఆశా కార్యకర్తగా పని చేస్తుంది.నరేష్-అరుణ దంపతులకు ఇద్దరు సంతానం. భార్య,భర్తల మధ్య గొడవ జరగడంతో నరేష్ ఇనుప రాడ్ తో అరుణ తలపై బలంగా కొట్టడంతో చనిపోయింది.సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అరుణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement