Tuesday, May 7, 2024

Breaking : ఎంజీఎం సూపరింటెండెంట్ పై .. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్) ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదుతో మట్వాడా పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఎంజీఎం హాస్పటిల్ లో కాసు రాములు అనే పేషెంట్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇందుకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే నిర్లక్ష్యం, బాధ్యతరహిత్యమే కారణమని ఆరోపిస్తూ లంబాడీ.. గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి.ఆసుపత్రిలో సకాలంలో వైద్య సేవలు అందించక పోవడం, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ నుండి అనుమతులు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంజక్షన్లు వికటించడం వల్లే బాధితుడు మృతి చెందారని మృతుని బంధువులు రోడ్డెక్కారు.

ఆందోళన చేస్తున్న చోటుకు ఎం జి ఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్ర శేఖర్ ఉద్దేశ్యపూర్వకంగా, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, కులం పేరుతో దూషించారని గుగులోతు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి ఫిర్యాదుతో పోలీసులు మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల కేసు నమోదుతో ఎంజీఎం హాస్పిటల్ లోని వైద్యులు,సిబ్బంది పోరాట కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నారు. వైద్యుల విధులకు విఘాతం కలిగించడమే కాక,తప్పుడు ఫిర్యాదులతో వైద్యుల మానసిక స్థైర్యం దెబ్బ తీయడం వల్ల, డాక్టర్లు,సిబ్బంది మానసిక ధైర్యం కోల్పోతున్నారన్న చర్చ సాగుతోంది. వైద్యులు సైతం కేసు నమోదు అంశంపై ఆందోళన బాటకు సమాయత్త మవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement