Friday, May 3, 2024

Breaking: పగబట్టిన పాము.. ఒకే ఇంట్లో ముగ్గురికి కాటు. మూడు నెలల చిన్నారి మృతి

పాము పగబట్టింది.. ఒకిరిని కాదు ఆ ఇంట్లో ముగ్గురిని కాటేసింది. ఈ ఘటనలో మడు నెలల చిన్నారి చనిపోయింది. మహబుబాబాద్ జిల్లా శనిగపురంలో ఈ ఘటన ఈ రోజు జరిగింది.

మహబుబాబాద్ శనిగపురం గ్రామానికి చెందిన క్రాంతి, మమత దంపతులు. వారికి అందాల పాప ఉంది. ఆ పాప పుట్టి మూడు నెలలే అవుతోంది. మాతత్వపు మాధుర్యం కూడా తీరకుండానే పాము రూపంలో మృత్యువు కాటేసింది.

వారి కుటుంబాన్ని పగబట్టిన పాము ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసింది. తల్లిదండ్రులైన క్రాంతి, మమత చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాగా ఇప్పటికే పాము కాటుతో ఆ మూడు నెలల చిన్నారి చనిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement