Monday, April 29, 2024

Big Breaking | బాటసింగారం ప్రోగ్రామ్​కి బ్రేక్​.. కిషన్​రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లపై బీజేపీ ప్రోగ్రామ్​ నిర్వహించడానికి పిలుపునిచ్చింది. ఇవ్వాల (గురువారం) ఉదయమే హైదరాబాద్​ ఎయిర్​పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి బాటసింగారం వెళ్లడానికి బయలు దేరారు. కాగా, అతను ఎయిర్​పోర్టు పరిసరాలు దాటగానే పోలీసులు అడ్డుకున్నారు. డబుల్​ ఇండ్ల పరిశీలించాలన్న పిలుపు మేరకు పెద్ద ఎత్తున బీజేపీ లీడర్లు, ఎమ్మెల్యేలు , కార్యకర్తలు తరలివచ్చారు.

అయితే.. ముందస్తుగా ఎట్లాంటి అనుమతి లేదని, అందుకనే అడ్డుకుంటున్నామని పోలీసులు తెలిపారు. అయినా సీన్​ క్రియేట్​ చేశారు బీజేపీ నేతలు. దీంతో పోలీసులు వారిని కదలకుండా అడ్డుకుని, కార్యకర్తలను వాహనంలో తరలించేందుకు రెడీ అయ్యారు. దీంతో కిషన్​రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్​ కలిసి రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement