Sunday, April 28, 2024

TS : రెండురోజులుగా బాలుడు మిస్సింగ్… కారులో ఊపిరాడక మృతి

కారులో ఊపిరాడక బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బోధన్ పట్టణంలో గోసం బస్తీకి చెందిన రేణుక కుమారుడు రాఘవ (6)తో కలిసి రాకసిపేటలోని హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో కూలి పనులకు వెళ్లారు.

ఈ క్రమంలో తల్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, కుమారుడు రాఘవ ఆడుకుంటానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. బాలుడు కనిపించకపోయే సరికి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా మిస్సింగ్ అయిన బాలుడు అదే ఏరియాలో పార్క్ చేసిన ఓ కారులో కనిపించాడు.

- Advertisement -

కారు డోర్లు తెరచుకుని ఉన్నప్పుడు బాలుడు అందులోకి వెళ్లగానే కారు ఒక్కసారిగా లాక్ అయింది. దీంతో ఆ చిన్నారి కారులోనే ఊపిరాడక మృతి చెందాడు. గత రాత్రి కారు యజమాని బయటకు వెళ్లేందుకు కారు తీస్తుండగా.. కారులో మృతదేహాన్ని గుర్తించి అతడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు బాలుడి మృతదేహాం గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించి పోస్ట్‌మార్టం తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement