Wednesday, May 15, 2024

Kesamudram: ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి..

కేసముద్రం, జులై 5(ప్రభాన్యూస్ ): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో జీపీ ట్రాక్టర్ క్రింద బాలుడు పడి మృతిచెందిన సంఘటన ఇవాళ చోటు చేసుకుంది. నారాయణపురం గ్రామానికి చెందిన మారుపంగా ఐలయ్య, విజయ దంపతుల కుమారుడైన చిన్ను (ఏడాదిన్నర) అనే బాలుడు జీపీ ట్రాక్టర్ క్రింద ప్రమాదవశాత్తు పడడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement