Thursday, April 25, 2024

వీర జవాన్లకే అందలే.. రైతులకు అందుతుందా?

తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఐపీఎస్, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. వీర జవాన్ల ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని.. ఇక రైతులకు ఏం ఇస్తుందని అన్నారు. ‘’గత జూన్ లో గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన అందరు వీర జవాన్లకు తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించి నేటికి 17 నెలలైతుంది. ఒక కీ.శే. కల్నల్ సంతోష్ గారి కుటుంబానికి తప్ప మిగతా 19 మందికి ఇంతవరకు ఏలాంటి సహాయం అందలేదు. 19 మంది వీరజవాన్లకే ఈ పరిస్థితి ఉంటే, మరి ఇటీవలే ప్రకటించిన 700 అమరులైన రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందడానికి ఇక ఎన్ని యుగాలు పడుతుందో…!’’ అంటూ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement