Monday, April 29, 2024

BJP: తెలంగాణ లోక్ స‌భ ఇన్ చార్జీలను ప్ర‌క‌టించిన బిజెపి

హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు వ్యూహ రచనలు చేస్తున్నారు. నేడు తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది కమిటీ నేతల భేటీ జరిగింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ పొలిటికల్ ఇంచార్జీలను తెలంగాణ బీజేపీ ప్రకటించింది.

ఈ మేరకు బీజేపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైద‌రాబాద్ అప్ప‌గించారు.. డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ కు సికింద్రాబాద్ , ఎమ్మెల్యే ధ‌న్ పాల్ ను క‌రీంన‌గ‌ర్ కు ఇన్ చార్జీలుగా నియ‌మించారు.

ఇంఛార్జ్‌లు వీరే..
►హైదరాబాద్- రాజసింగ్
►సికింద్రాబాద్- డాక్ట‌ర్ లక్ష్మణ్
►చేవెళ్ల- ఎమ్మెల్సీ వెంకట్ నారాయణ రెడ్డి
►మల్కాజిగిరి- పైడి రాకేష్ రెడ్డి
►అదిలాబాద్‌- పాయాల్ శంకర్
►పెద్దపల్లి- రామారావు పటేల్
►కరీంనగర్‌- ధన్ పాల్ సూర్యనారాయణ
►నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
►జహీరాబాద్‌- వెంకట రమణ రెడ్డి
►మెదక్- పాల్వాయి హరీష్
►మహబూబ్ నగర్- రామచందర్ రావు
►నాగర్ కర్నూలు- మాగం రంగారెడ్డి
►నల్గొండ- చింతల రామచంద్రారెడ్డి
►భువనగిరి – NVSS ప్రభాకర్
►వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి
►మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు
►ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement