Saturday, May 4, 2024

ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ, BJYM నాయకులు యత్నించారు. mlc ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ పై జరిగిన దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. క్యాంపు కార్యలయం ముట్టడికి యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో క్యాంప్ ఆఫీస్ ఏరియాలో పరిస్థితులు కాసేపు ఉద్రిక్తంగా మారాయి. బీజేపీ, BJYM నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పీఎస్ కి తరలించారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచందర్ రావు, BJYM కార్యకర్తలున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement