Monday, April 29, 2024

కల్వర్టును ఢీకొన్న బైక్ – ఒకరి మృతి

కామారెడ్డి,ప్రభన్యూస్…కామారెడ్డి రామారెడ్డి మధ్య ఉన్న కల్వర్టును బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వారు ఉప్పల్వాయి గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి కే సాయిబాబాగా గుర్తించారు. రామారెడ్డి నుండి కామారెడ్డికి ముగ్గురు బైక్ పై వస్తున్నారు. రామారెడ్డి సమీపంలో బైకు కల్వర్టును ఢీకొంది. బైక్ నడుపుతున్న సాయిబాబా రైల్వే ఉద్యోగి గ్రామం ఉప్పల్వాయి చనిపోయారని పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరు అభిలాష్ గాజులపేట నిజాంబాద్ ఆకుల నరేష్ గాజులపేట నిజాంబాద్ లకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేస్తున్నారు. చనిపోయిన రైల్వే ఉద్యోగి సాయిబాబాకు శవ పరీక్షల కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement