Sunday, April 28, 2024

TS: భూపాలపల్లి సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఐటి పురపాలక మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సోమవారం హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో భూపాలపల్లి చేరుకున్నారు. భూపాలపల్లి వచ్చిన మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, స్థానిక ప్రజాప్రతినిధులు పుష్ప గుచ్చం ఇచ్చి ఘనస్వాగతం పలికారు.

అనంతరం రూ.59కోట్ల 42 లక్షలతో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నూతన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను సీటులో ఆశీనులను చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్వమత సమ్మేళనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్ లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement