Sunday, April 28, 2024

Bangalore : ఖ‌ర్గేతో భ‌ట్టి విక్ర‌మార్క‌, పొంగులేటి భేటీ

ఖమ్మం కాంగ్రెస్ లోక్ స‌భ‌ సీటు విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఖమ్మం లోక్ సభ సీటుపై పట్టుదలతో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సీటు కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. తన సోదరుదు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని ఆయన పట్టుబడుతున్నారు. మరోవైపు ఇదే సీటు కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కూడా పట్టుదలతో ఉన్నారు. తన భార్య నందినికి లేదా రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ఖమ్మం పంచాయతీ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వద్దకు చేరింది. మల్లు భట్టి, శ్రీనివాస్ రెడ్డిలను డీకే శివకుమార్ తన వద్దకు పిలిపించుకున్నారు. బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తొలుత ఇద్దరు నేతలతో విడివిడిగా సమావేశమై చర్చించిన ఖర్గే.. తర్వాత ఇద్దరి నేతలతో అభ్యర్థి ఎంపికపై చరిస్తున్నారు. ఖమ్మం టికెట్ తమ కుటుంబీకుల కోసం పట్టు పడుతున్న ఇద్దరు మంత్రుల.. పోటా పోటీగా ప్రయత్నిస్తున్నారు. ఈ భేటీ తర్వాత ఖమ్మం ఎంపీ అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement