Sunday, April 28, 2024

KNR: జనావాసాల్లో ఎలుగుబంటి.. భయంతో ప్రజల పరుగులు

కరీంనగర్ నగరంలోని పలు ప్రాంతాలలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. శనివారం తెల్లవారు జామున నగరంలోని రాజ్వీ చమన్, శుభం గార్డెన్ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తోంది. 10గంటల ప్రాంతంలో రేకుర్తి దాసరి గార్డెన్ లో ప్రవేశించింది.

భయాందోళనతో నగర వాసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా రెస్పాన్స్ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజ్వీ చమన్ గల్లిలో కర్రలు పట్టుకొని యువకుల గస్తీ నిర్వహించారు. ఎలుగుబంటి జనావాసాల్లోకి ప్రవేశించిన సీసీ పుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement