Monday, April 29, 2024

TS – బాసర ట్రిబుల్ ఐటీ లో విషాదం …ఉరేసుకుని విద్యార్హిని ఆత్మహత్య

బాసర ఫిబ్రవరి 22( ప్రభ న్యూస్) నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ లో విషాదం నెలకొంది. యూనివర్సిటీ లో పి యుసి మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లా మానూరు మండల్ దావూరు గ్రామానికి టి శిరీష హాస్టల్ గది లో ఉరివేసుకుంది. గమనించిన విద్యార్థినిలు అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థిని స్థానిక ఆసుపత్రిలో వైద్యులు చికిత్స నిర్వహించిన అప్పటికే విద్యార్థిని మృతి చెందిందని డాక్టర్ లు ధ్రువీకరించారు.

మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.విద్యార్థిని మృతికి పూర్తి వివరాలు తెలియారావడం లేదు.యూనివర్సిటీ అధికారులు విద్యార్థిని కుటుంబ సభ్యుల కు సమాచారం అందించారు.విద్యార్హిని మృతికి యూనివర్సిటీ విసి,డైరెక్టర్ సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement