Friday, April 26, 2024

బండి సంజ‌య్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

తెలంగాణ రాష్ట్ర‌ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సచివాలయం డోమ్‌లు కూల్చేస్తామంటూ బండి సంజ‌య్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇటీవల ప్రగతి భవన్‌ ను కూల్చేయాలని కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు సచివాలయం డోమ్‌లు కూల్చేస్తామంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు బండి సంజయ్‌.

తాము అధికారంలోకి వ‌చ్చాక‌ సెక్రటేరియట్ పైన ఉన్న డోమ్‌లను కూల్చివేస్తామ‌ని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తామన్నారు. కూకట్ పల్లిలో పేదల భూములను కబ్జా చేశారు… వారి పైన కేసులు కూడా పెడుతున్నారన్నారు. 11 వేల మీటింగ్ లు పెడతాం… బహిరంగ సభలు కాదని..ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీ కి పట్టం కడుతున్నారని తెలిపారు. ఈ రోజుకి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదని ఆగ్రహించారు. తెలంగాణ కు 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుండే వస్తుంది… హైదరాబాద్ ను ఏ మేరకు అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలని ఫైర్‌ అయ్యారు. బీఆర్ఎస్ ఎంఐఎం ఒక్క‌టేన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement