Monday, May 6, 2024

Bandi Sanjay – కాళేశ్వరం పై కాంగ్రెస్ ద్వంద వైఖరి..సి బి ఐ విచారణ కోరక‌పోవ‌డంపై ఆగ్ర‌హం ..

క‌రీంన‌గ‌ర్ – కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేద‌ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బి జె పి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పింది అని గుర్తు చేశారు. ఏబీవీపీ పూర్వ విద్యార్ధిగా సంస్థ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన 3కే రన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదన్నారు. కేవలం మేడిగడ్డ బ్యారేజీపైనే ఎందుకు జ్యూడిషియల్ విచారణ అడుగుతున్నారని ప్రశ్నించారు బండి సంజయ్. కాంగ్రెస్ ద్వంద్వ విధానాాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉందన్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరాలి అని డిమాండ్ చేశారు.

ఆమెరిక‌న్ల ఆత్మ‌ను త‌ట్టిలేపిన మ‌హ‌నీయుడు స్వామి వివేకానంద ..

స్వామి వివేకానంద చరిత్ర, ఆశయాలను ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. స్వామి వివేకానంద గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన నేత వివేకానంద అన్నారు బండి. అమెరికాను కొలంబస్ కనుగొంటే…. అమెరికన్ల ఆత్మను తట్టిలేపిన వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. విదేశాల్లో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం ఎన్నటికీ మరువలేనిదన్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్క్రతిని ప్రపంచానికి చాటిన నేత అని కొనియాడారు. వివేకానందవంటి మహనీయుల స్పూర్తితో ముందుకు సాగుతుందో ఆ దేశం బాగుపడుతుందన్నారు. వివేకానంద స్వామి స్పూర్తితో ప్రధాని మోడీ పనిచేస్తున్నారన్నారు. :భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దే పనిలో ఉన్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement