Thursday, April 25, 2024

పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు.. పోస్టర్ ఆవిష్కరించిన కేటీఆర్‌

తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం, శాతవాహన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈనెల 20వ తేదీన‌ కరీంనగర్ లోని శుభం గార్డెన్స్ లో నిర్వహిస్తున్న పోటి పరీక్షలపై అవగాహన సదస్సు పోస్టర్‌ను ఈరోజు మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఆయ‌న మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటన వెలువరించారని, నిరుద్యోగ యువత ఎటువంటి వదంతులు నమ్మకుండా పోటి పరీక్షలకు ప్రిపేర్‌ కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించడంపై సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, హన్మంతు నాయక్ , ఇతర గ్రూప్ 1 అధికారులను కేటీఆర్ అభినందించారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ , ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కర్ణన్ , శాతవాహన యూనివర్సిటి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మల్లేశ్ సంకశాల, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement