Wednesday, April 24, 2024

సివిల్స్ మెయిన్స్ రిజ‌ల్ట్ విడుద‌ల..

అఖిల భార‌త స‌ర్వీసు అధికారుల ఎంపిక కోసం నిర్వ‌హించే సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల్లో భాగంగా మెయిన్స్‌కు సంబంధించిన ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. ఈ పరీక్ష‌లో మెరిట్ సాధించిన అభ్య‌ర్థులు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్ వంటి ప‌లు స‌ర్వీసు అధికారులుగా ఎంపిక అవుతారు.

సివిల్ స‌ర్వీసెస్-2021లో భాగంగా ప్రిలిమ్స్‌లో మెరిట్ సాధించిన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మెయిన్స్ ఫ‌లితాలు కూడా విడుద‌లైపోగా.. ఈ ప్రక్రియ‌లో తుది అంక‌మైన ఇంట‌ర్వ్యూల‌కు 1,823 మంది ఎంపికైన‌ట్లుగా యూపీఎస్సీ ప్ర‌క‌టించింది. వీరికి ఏప్రిల్ 5 నుంచి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు యూపీఎస్సీ వెల్ల‌డించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement