Monday, April 29, 2024

Cricket : అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచ కప్‌కు ఎంపికైన అవనీష్‌రావు

సిరిసిల్ల, డిసెంబర్‌ 14 (ప్రభన్యూస్‌): దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచ కప్‌, టై సిరీస్‌లకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అరవెల్లి అవనీష్‌రావు ఎంపికయ్యారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ద్వారా అవనీష్‌రావు ఎంపికయ్యారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌ గ్రామానికి చెందిన అరవెల్లి అవనీష్‌రావు చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న ఈ యువకుడు అండర్‌- 19 క్రికెట్‌ ప్రపంచ కప్‌ కు వికెట్‌ కీపర్‌గా ఎంపిక కావడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement