Thursday, May 2, 2024

TS | మద్యం షాపు వద్దంటూ ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ టవర్ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత వాసులు ఆందోళన ప్రారంభించారు. ఇవాళ కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన స్థానికులు ధర్నా చేశారు.

ఈ క్రమంలో అశోక్ అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. స్థానికులు అడ్డుకున్నారు. టవర్ వ్యాపార కూడలి అని.. నిత్యం వేలాది మంది షాపింగ్ కు వస్తుంటారని.. ఇలాంటి చోట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే వ్యాపారం దెబ్బతింటుందని.. అనుమతి ఇస్తే ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆందోళన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement