Tuesday, April 30, 2024

MDK: చేగుంటలో దారుణం… యువతి దారుణ హత్య

మెదక్ జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. చేగుంట మండలం వడియారం సమీపంలో ఓ యువతిని పెట్రోల్ పోసి కాల్చి హత్య చేశారు. హైదరాబాద్‌ రహదారి పక్కన సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె వయసు 25 ఉంటుందని పోలీసులు తెలిపారు. దుండగులు ఆమెను ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తెచ్చి పెట్రోలు పోసి నిప్పంటించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి ఒంటిపై కాషాయరంగు టాప్, ఎరుపు లెగ్గిన్ ఉందని, ఎవరైనా గుర్తిస్తే వెంటనే తమను సంప్రదించాలని చేగుంట పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement