Monday, April 29, 2024

TS: ఆస్ప‌త్రుల‌కు, పాఠ‌శాల‌ల‌కు సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్దం..సోనూసూద్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడానికైనా రెడీగా ఉంటానన్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి సోనూసూద్ సోమ‌వారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు ఏదైనా సహాయం కోరితే తాను తప్పకుండా చేస్తానన్నారు.

పంజాబ్ కు చెందిన వ్యక్తినయినా బాలీవుడ్ సినిమాలు చేయకున్నా..తెలుగులో సినిమాలు చేశానని చెప్పారు సోనూసూద్. తన భార్య తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తన్నారు. తనకు తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక అనుభందం ఉందన్నారు .ఈ రోజు శంషాబాద్ పరిధిలోని సిద్ధాంతి గ్రామంలో ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంత సంతోషం టాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పుడు కూడా లేదన్నారు. సామాజిక సేవకు ఉన్న ప్రత్యేకత వేరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement