Wednesday, March 27, 2024

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎప్పుడూ ముందుంటా : ఎమ్మెల్యే వివేకానంద్

సంక్షేమ సంఘం సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ ఎటువంటి సమస్యలున్నా.. తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివ‌కానంద్ గౌడ్ హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని బాల్ రెడ్డి నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వివేక్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ లింగా రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ బలరాం రెడ్డి, దుర్గా రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మూర్తి, జెనరల్ సెక్రెటరీ రవీందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు భగిధర్ రెడ్డి, ప్రదీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు అనూప్ రెడ్డి, భాను, అరుణ కుమారి, ట్రెజరర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement