Tuesday, April 30, 2024

గుజరాత్​ ఎన్నికల్లో పోటీకి ఎంఐఎం రెడీ.. పోర్​బందర్​లో పర్యటించిన అసదుద్దీన్​ ఓవైసీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) సిద్ధమైంది. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ నిన్న పోర్‌బందర్​లో పర్యటించారు. కాగా ఆయన ట్విట్టర్​లో ఈ వివరాలను పోస్టు చేశారు. “నేను గుజరాత్ ఎన్నికల కోసం కచ్‌లో కొన్ని పార్టీ సమావేశాలు, ర్యాలీలో పాల్గొనడానికి పోర్‌బందర్‌కు వచ్చాను. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 12 రోజుల సన్నద్ధతతో మేం బాగానే చేశాం’’ అని ఒవైసీ ట్విట్టర్​లో పేర్కొన్నారు.  అయితే.. మహారాష్ట్రలోని భివాండీలో ప్రసంగిస్తూ “వారు తాజ్ మహల్ కింద ప్రధానమంత్రి డిగ్రీ కోసం వెతుకుతున్నారు” అని  ఒవైసీ ఎద్దేవా చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement