Thursday, May 2, 2024

ADB: గుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

దండేపల్లి: ఆగస్టు 16 (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామం ప్రాంతంలో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్నారనే సమాచారంతో రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్ ఆదేశాల మేరకు బుధవారం టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ లు అశోక్, సుధాకర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ రాకేష్ గుడుంబా స్థావరాలపై దాడులు చేసి గుడుంబా తయారీ కి ఉపయోగించే 100 లీటర్స్ బెల్లం పానకం గుర్తించి ధ్వంసం చేయడం జరిగింది.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అక్రమంగా గుడుంబా తయారు చేసినా, అమ్మినా, నాటుసారా తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలైన బెల్లం, పట్టిక, రవాణా చేసినా, నిలువ చేసినా అటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement