Saturday, May 4, 2024

TS: మంచిర్యాలలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యటన

నస్పూర్, అక్టోబర్ 27 (ప్రభ న్యూస్) : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. జిల్లాలో నిర్వహించనున్న ఉమ్మడి జిల్లా కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం, ఇవిఎం, చెక్ పోస్ట్, పోలింగ్ బూత్, లా అండ్ ఆర్డర్, వంటి అవగాహన కార్యక్రమాలు చేసేందుకు రావడంతో నస్పూర్ లోని సింగరేణి గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వన్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హేమంత్ భోర్కాడే, అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్, రామగుండం కమిషనర్ రేమా రాజేశ్వరి, మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకెన్, ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఆసిఫాబాద్ ఎస్పీ సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement