Friday, May 17, 2024

మంత్రి హరీష్ రావును కలిసిన శ్యాం నాయక్

ఉట్నూర్, జులై 21(ప్రభ న్యూస్) ; తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును శుక్రవారం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా గెస్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర శ్యాం నాయక్ హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఖానాపూర్ నియోజకవర్గం క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఏ ఐ బి ఎస్ ఎస్ రాష్ట్ర అద్యకుడు రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement