Tuesday, April 30, 2024

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

తాంసి, జూన్ 10 (ప్రభ న్యూస్) : వికలాంగుల పింఛను వేయి రూపాయలు పెంచుతూ 3 వేల 16 నుంచి 4 వేల 16 చేదినందుకు గాను శనివారం తాంసి మండల కేంద్రంలో వికలాంగులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ వికలాంగుల సభ్యుల తో పాటు బీఆర్ ఎస్ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్, గ్రామ బీఆర్ ఎస్ అధ్యక్షుడు పరమేశ్వర్, మాజీ ఎంపీటీసీ గంగారాం, వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు విద్యాధర్, రత్నాకర్, గంగమ్మ, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement