Thursday, May 2, 2024

ADB: బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, జనవరి 6(ప్రభ న్యూస్): ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణ శివారులో గల కాండ్రీవాగు పై నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం 2 కోట్ల 25 లక్షల ఆర్ అండ్ బి నిధులతో చేపట్టే నిర్మాణానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోథ్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల చిరకాలవాంఛ అయినటువంటి బోథ్ కాండ్రివాగు బ్రీడ్జి నిర్మాణం తో తీరానున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, ఎంపీపీ నిమ్మల ప్రితం రెడ్డి, మార్కెట్ చైర్మన్ రుక్మన్ సింగ్, సంబంధిత శాఖ అధికారులు, మల్లెపూల సుభాష్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, సర్పంచ్ సురేందర్ యాదవ్, అల్లగొండ ప్రశాంత్ సదానందం, పలువురు సర్పంచులు ఎంపీటీసీలు నాయకుల పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement