Thursday, May 2, 2024

ADB: ఉట్నూర్ పీఎంఆర్సీలో మంత్రి సీతక్క బస

ఉట్నూర్, జనవరి 31(ప్రభ న్యూస్): ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మంగళవారం రాత్రి పీఎంఆర్సి లో బస చేశారు. ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి పర్యటన కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి సీతక్క సందర్శించారు.

బుధవారం ఉదయం ఉట్నూర్ పిఎంఆర్సి లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి ఇంద్రవెల్లి లో ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లారు. మంత్రి వెంట కానాపూర్ ఎమ్మెల్యే వెడమ బోజ్జు పటేల్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement