Friday, May 3, 2024

TS: బాసరలో మంత్రి సీతక్క పర్యటన

బాసర, ఏప్రిల్ 21(ప్రభ న్యూస్) : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఇవాళ బాసరలో పర్యటిస్తున్నారు. బాసర మండల కేంద్రంలో ఆమె కాంగ్రెస్ అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాత్రం సుగుణక్కతో కలసి శారదా నగర్ లోని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు.

- Advertisement -

అంతకుముందు బాసర చేరుకున్న మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క ను మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ రమేష్, లక్ష్మణరావు, సంజీవ రావు దేశ్ముక్ ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘానా స్వాగతం పలికారు. రవీంద్రపూర్ , శారద నగర్, అంబేద్కర్ కాలనీ మైలాపూర్ లో మంత్రి సీతక్క తో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకేజ్ ఓటు వేసి ఆత్రం సుగుణకను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సీతక్క ఓటర్లను కోరారు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో మహిళలకు రాయితీ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతుబంధు తో పాటు ఇతర పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, రాజు దేశాయ్, జిడ్డు మల్లయ్య, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement