Sunday, April 28, 2024

ABD | విద్యుత్ షాక్ తో మెకానిక్ మృతి.. కేసు నమోదు

జన్నారం, (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇప్పలపల్లికి చెందిన ఎలక్ట్రిక్ మోటార్ మెకానిక్ తాళ్లపెల్లి రాజేష్ (30) ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. మండలంలోని బాదంపల్లికి చెందిన బెడడ కృష్ణ, తాళ్లపల్లి రాజేష్‌లు గోదావరినదిలో చేపల వేటకు వెళ్లి కరెంటు వైరుతో చేపలు పట్టేందుకు ప్రయత్నించగా…. రాజేష్ అనే మెకానిక్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేష్ మృతికి కృష్ణ తదితరులు కారణమని బంధువులు ఆరోపించారు. మృతుడికి భార్య లతిక, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘ‌ట‌న‌పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement