Friday, May 3, 2024

ADB | మహిళ ఆత్మహత్య.. కుటుంబ తగాదాలే కారణం..

జైనూర్ (ప్రభన్యూస్): కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఓ వివాహిత ఆత్మ‌హ‌త్య చేసుకుంది. పట్నాపూర్ గ్రామానికి చెందిన మ‌హిళ మనస్థాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్ప‌డింది. ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు. గ్రామానికి చెందిన కవిత (19), ఆమె భర్తకు మధ్య గొడవలు.. మనస్పర్ధలు వ‌చ్చాయి. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement