Monday, May 6, 2024

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి

బైంసా రూరల్ (ప్రభ‌ న్యూస్) : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా కే గ్రామంలో సుమారు 27 లక్షల రూపాయిలతో హనుమాన్ మందిరాన్ని నిర్మించటం జ‌రిగింద‌ని ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి అన్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత దేవాలయల యొక్క అభివృద్ధి చాలా జరిగింద‌న్నారు. ముధోల్ తాలూకాలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎన్నో దేవాలయాలు నిర్మించుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. వారికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ అశోక్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మోరే ఆనంద్ రావు పటిల్, ఎంపీటీసీ సునంద గిరిష్, బీఆర్ ఎస్ మండల్ కన్వీనర్ పడకంటి దత్తు, ఉప సర్పంచ్ ముత్యం రెడ్డి, డైరెక్టర్ గజ్జరం, శ్రీకర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, మాధవరావు, భాస్కర్ రెడ్డి, రజినీకాంత్, వంశీకృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణ గౌడ్, రాజేందర్, రాజు మరియు వీడీసీ సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement