Monday, May 6, 2024

ఈపీ ఆపరేటర్‌ ట్రైనీ పరీక్షలకై ముందస్తు చర్యలు..

శ్రీరాంపూర్: శ్రీరాంపూర్‌ ఏరియాలో జీఎం కార్యాలయంలో జీఎం ఎం.సురేష్‌ అధ్యక్షతన ఈపి ఆపరేటర్‌ ట్రైనీ పరీక్షలపై ముందస్తు చర్యలపై కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఈపీ ఆపరేటర్‌ ట్రైనీ పరీక్షల్లో పాల్గొంటున్న అభ్యర్థులకు కావాల్సిన సదుపాయాల గురించి ప్రగతి స్టేడియంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ట్రైనీ పరీక్ష జరిగేటప్పుడు కావాల్సిన సివిల్‌ పనులు, వెహికిల్‌ అరేంజ్‌మెంట్‌, లైసెన్స్‌ తనిఖీలు, ఇతర పనులకు సంబంధించిన అన్ని విషయాలను చాలా కట్టుదిట్టంగా ఉంచాలని కమిటీ సభ్యులకు జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ-2 జీఎం కుమారస్వామి, డీజీఎం పర్సనల్‌ గోవిందరాజు, ఐఈడీ చిరంజీవులు, డీజీఎం సివిల్‌ శివరావు, డీజీఎం ఏరియా వర్క్‌షాప్‌ డి.వి.రావు, సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement