Saturday, April 27, 2024

మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఎన్నికలు..

కాసిపేట : కాసిపేట మండలంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం విశ్వకర్మబ్రహ్మణ ఐఖ్యవేదిక ఆద్వర్యంలో సీక్రట్‌ బ్యాలెట్‌ విధానంతో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరిగాయి. ఈ సంధర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో విశ్వబ్రహ్మణుల కులాలు చురుకుగా పాల్గొన్నాయని, ఆయినప్పటికి రాష్ట్రం ఏర్పడినాక ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని పేర్కోన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల యందు ఎన్నికలు జరుగుతున్నాయని, దీంతో నాయకులకు రాష్ట్రంలో వున్న దాదాపు తొమ్మిది లక్షల విశ్వబ్రహ్మణుల ఐఖ్యత తెలియచేసేందుకు, భవిష్యత్‌లో హక్కుల పరిరక్షణకు సంఘటితమయ్యేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మొదటిసారి సీక్రేట్‌ బ్యాలెట్‌ విధానంతో నాయకులను ఎన్నుకునేందుకు అలోచనలు చేసి అమలుచేస్తున్నట్టు వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి చేతివృత్తులపై ఆదారపడి కుటుంబాలను పోషించుకుంటున్న విశ్వబ్రహ్మణ కులాలను ఆదుకునేందుకు అలోచనలు చేయాలని వారు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement