Friday, April 26, 2024

నిర్మ‌ల్ జిల్లా నిరంజ‌న్ రెడ్డికి ఏపీ రాజ్య‌స‌భ సీటు

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాకు రాజ్యసభ స్థానం లభించనుంది. నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వైయస్సార్ తెలంగాణ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేసినట్లు అనుకుంటున్నారు. నిరంజన్ రెడ్డి సిర్గాపూర్ గ్రామానికి చెందిన స్వర్గీయ సీనియర్ న్యాయవాది ఎస్.విద్యాసాగర్ రెడ్డి కుమారుడు. నిర్మల్ ప్రాంతానికి చెందిన నిరంజన్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక కావ‌డం ప‌ట్ల ఇక్కడి ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement