Sunday, April 28, 2024

ADB : కాంగ్రెస్ పార్లమెంట్ ఓబిసి కమిటీ ఇంఛార్జీగా అంబకంటి అశోక్

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ప్రభ న్యూస్: కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంటరీ కమిటీ ఓబిసిడి భాగం ఇంఛార్జిగా ఆదిలాబాద్‌కు చెందిన సీనియర్ నాయకుడు, కౌన్సిలర్ అంబకంటి అశోక్ ని నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పట్టణంలోని 37 వ వార్డు కౌన్సిలర్ గా మూడుసార్లు ఎన్నికైన అంబకంటి అశోక్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఓబిసి కమిటీ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓబిసి విభాగం నుండి అదనపు ఇంఛార్జి సమన్వయ బాధ్యతలతో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ కమిటీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. అంబకంటి అశోక్ కు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు హర్ష వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement