Tuesday, April 30, 2024

ADB: తొలిరోజు రెండు నామినేషన్ల బోణీ..

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ గురువారం విడుదల కాగా అదిలాబాద్ లోక్ స‌భ‌ స్థానానికి తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇచ్చోడ మండలానికి చెందిన రాథోడ్ సుభాష్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, మ‌రో పార్టీ నుంచి మాలోత్ శ్యామలాల్ నాయక్ నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారి రాజార్షి షా కు అందజేశారు.

ఎన్నికల వ్యయ పరిశీలకులుగా జాదా వార్ వివేకానంద గురువారం జిల్లాకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గౌస్ అలం, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఎన్నికల పరిశీలకుల‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. కాగా ఈనెల 25 వరకు నామినేషన్లు ఉంటాయని రిటర్నింగ్ అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement