Monday, April 29, 2024

ADB: అధికారుల వేధింపులకు.. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం

జన్నారం, మార్చి 15 (ప్రభ న్యూస్): ఇద్దరు అధికారుల వేధింపులు భరించలేక జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషాదకర సంఘటన ఇది. వివరాల్లోకి వెళితే… మంచిర్యాల జిల్లా జన్నారం వాసి, నీటిపారుదల శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న తోకల రాకేష్ అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారుల వేధింపులు తాళలేక గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ప్రస్తుతం ప్రతిమ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు.

నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఈఈ నీటిపారుదల శాఖ కార్యాలయంలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న తోకల రాకేష్ పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండగా, స్థానికంగా ప్రథమ చికిత్స చేయించి, అక్కడి నుండి కరీంనగర్ లోని ప్రతిమ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ విషాదకర సంఘటన జన్నారం, కడెం మండలాల్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారమై శుక్రవారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement