Friday, May 3, 2024

Bhupalpalli: తహశీల్దార్ పై దాడి.. నిందితులపై చర్యలకు ఉద్యోగ సంఘాల డిమాండ్

భూపాలపల్లి (ప్రభ న్యూస్): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం కేటాయించిన స్థల పరిశీలనకు వెళ్ళిన స్థానిక తహశీల్దార్ ఇమ్మానియల్ పై దాడికి పాల్పడిన నవీన్, ప్రవీణ్ లపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ భూపాలపల్లి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జ్ లు ధరించి భోజన విరామంలో నినాధాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు టి.శ్రీనివాసరావు, కార్యదర్శి ఎండి.ఇక్బాల్, కలెక్టరేట్ ఏవో బి.మహేశ్ బాబు, కోశాధికారి ఎంఎ.రజాక్, తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ అధ్యక్షులు సామెల్ సిపివో, కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement