Friday, May 3, 2024

Accident | మోటార్ సైకిల్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురి పరిస్థితి విషమం

మంగపేట, (ప్రభ న్యూస్): ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్ ను ఢీ కొట్టడంతో నలుగురి తీవ్ర గాయాలు అయిన సంఘటన ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని తెలంగాణ సెంటర్ లో జరిగింది. మంగపేట మండలంలోని కొత్తూరు మొట్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరాం నగర్ కు చెందిన మడవి సురేష్ ,చిన్నారి దంపతులు తమ కుమారుడు మడవి నవీన్, కుమార్తె మడవి ఇలాషా తో మంగపేట గవర్నమెంట్ ఆసుపత్రి వైపు నుండి మోటార్ సైకిల్ పై తెలంగాణ సెంటర్ వైపుకు వస్తున్నారు. ఇదే సమయంలో టీఎస్ 03 యుఎ 8692 నెంబర్ గల ఆర్టీసీ బస్సు మంగపేట నుండి హన్మకొండ వెళ్తుంది.

ఈ క్రమంలో తెలంగాణ సెంటర్ లోమోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మడవి సురేష్ ,చిన్నారి దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మోటార్ సైకిల్ మీద నుండి కిందపడ్డారు. కింద పడ్డ మోటార్ సైకిల్ తో పాటు మడవి నవీన్ ను బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్ళింది. గమనించిన స్థానికులు స్పందించి 108 వాహన సిబ్బందికి, మంగపేట పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని మొదట మంగపేట ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం అక్కడ నుండి 108 వాహనంలో ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. కాగా బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మడవి నవీన్, మడవి సురేష్, మడవి చిన్నారిల ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/SajjanarVC/status/1669901861913231361
Advertisement

తాజా వార్తలు

Advertisement