Thursday, May 9, 2024

Accident – రెండు బైక్ లు ఢీ – ఒకరి మృతి…. ముగ్గురికి గాయాలు

కుల్కచర్ల, అక్టోబర్,25, (ప్రభ న్యూస్) : కుల్కచర్ల మండల పరిధిలోని గండి చెరువు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని గోరుగడ్డ తండాకు చెందిన శ్రీనివాసు, జయ, ఇద్దరూ కలిసి చౌడాపూర్ మండలానికి వెళ్తుండగా మండల పరిధిలోని గుబ్బడి తండా కు చెందిన శ్రీనివాస్ మరో వ్యక్తి, రెండు మోటార్ సైకిల్ ఢీకొనడంతో గోరిగడ్డ తండా పంచాయతీకి చెందిన శ్రీనివాస్ మృతిచెందగా జయ అనే మహిళ తీవ్ర గాయాలపాలై ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం, తీవ్రంగా గాయాల పాలైన జయ, బాలు మరో వ్యక్తిని మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు మిగతా వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement