Friday, May 17, 2024

Accident – లారీ- బొలేరో ఢీ.. ముగ్గురి దుర్మరణం..

రంగారెడ్డి: ఎదురుగా వస్తున్న లారీని బొలేరో వాహనం ఢీకొన్న ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పురపాలిక పరిధిలోని సోలిపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి డివైడర్‌ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

మృతులు వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement